2019 ఎన్నికలు ఏపీలో రసవత్తరంగా జరగనున్నాయి. కొత్త పొత్తులు తెరపైకి రానున్నాయి.పార్టీలు వేరైనా గమ్యం ఒక్కటే కాబట్టి ప్రధాన పార్టీలు కలసి పోటీచేస్తాయనడంలో సందేహంలేదు.
రెండు పార్టీలు ప్రత్యేక హోదాకోసం పోరాటం చేస్తున్నాయి.దీనికోసం రాష్ట్రంలో ఏ పార్టీకైనా మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్నారు.వచ్చే ఎన్నికలు ప్రధానంగా ప్రత్యేకహోదా అనే అంశంమీదనే జరుగుతాయి కాబట్టి ప్రధాన పార్టీలు కలువ నున్నాయి.
అసలు విషయమేమిటంటే నవ్యాంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలలో ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా అంశంపై ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ట్వీట్ చేశారు. పవన్ కళ్యాన్ కూడా ప్రత్యేక హోదాపైనే పోరాడుతున్న సంగతి తెలిసందే.ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసే ఏ పార్టీకైనా తాను మద్దతు ఇస్తానని ఆయన ట్విట్టర్ సాక్షిగా ప్రకటించారు.
{loadmodule mod_custom,GA2}
మూడు ఏండ్లుగా రాష్ట్రానికి దక్కాల్సిన ప్రత్యేక హోదా కోసం నిత్యం ప్రత్యేక హోదాకోసం అలుపెరుగతి పోరాటం చేస్తున్నారు.జగన్,పవన్ పార్టీలు వేరైనా గమ్యం మాత్రం ప్రత్యేక హోదా ఒక్కటే కాబట్టి ఇద్దరూ కూడా ఒకే తాటిపైకి వచ్చే అవకాశాలున్నాయి.తాజాగా పవణ్ భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే వైసీపీ పార్టీ కి ,ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలవడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Related