Sunday, May 19, 2024
- Advertisement -

నేనొస్తే మళ్లీ తొక్కిసలాట జరుగుతుందని భయం: పవన్

- Advertisement -

గోదావరి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన భక్తులకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరపున సహాయ సహకారాలు అందించాలని తన పార్టీ కార్యకర్తలకు పవన్ సూచించారు. ఈ సంఘటన నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. 

గాయపడిన వారికి నా సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆశిస్తున్నానన్నారు. అక్కడకు వచ్చి వారిని ప్రత్యక్షంగా పరామర్శించి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉందని ఆయన మనసులోని మాటను వెలిబుచ్చాఋ. 

కానీ దానివల్ల మళ్ళీ తొక్కిసలాట జరిగి ప్రజలకు, ప్రభుత్వ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని విరమించుకున్నానన్నారు. మా పార్టీ తరపున తోడ్పాటు ఉంటుందని పేర్కొన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -