Sunday, April 28, 2024
- Advertisement -

కోడిగుడ్ల పొట్టు, సొన తూడ్చుకుని లైవ్ షో కు హాజరు

- Advertisement -

జనసేన అధినేత, పాపులర్ హీరో పవన్ కళ్యాణ్‌పై కొంతకాలంగా విమర్శలు చేస్తూ ఆయన అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై దాడి జరిగింది. గురువారం రాత్రి ఆయన 99 టివిలో చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లుండగా కొండాపూర్ లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో కారుపై దాడి చేశారు.

ఈ దాడిలో కత్తి మహేష్ మీద కోడిగుడ్లు పడి పగిలిపోయాయి. కారుపైనా కోడిగుడ్లు పడ్డాయి. దాడి చేసిన వారి వివరాలు అందలేదు. అయితే వారు కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అయి ఉంటారని చెబుతున్నారు. కత్తి మహేష్ పై దాడి జరిగిన తర్వాత ఆయన అదరకుండా బెదరకుండా వ్యవహరించారు. కోడిగుడ్ల సొన, కోడిగుడ్ల పొట్టు తూడ్చుకుని అదే ఊపులో 99 టివి చానెల్ లో లైవ్ షో లో పాల్గొన్నారు. మొహంపై కారుతున్న కోడిగుడ్ల సొనను తూడ్చివేసి లైవ్ షోలో తనపై దాడి జరిగిన వివరాలను వెల్లడించారు.

వారెవరో తనకు తెలీదని, వారిని స్పష్టంగా కూడా చూడలేదని కత్తి మహేష్ అన్నారు. తాను కారులో కూర్చొని మొబైల్ చూసుకుంటుండగా తన కుడివైపు నుంచి కోడిగుడ్లతో దాడి చేశారని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -