అనంతపురంలోని ఈ రోజు జరిగిన సీమాంధ్ర హక్కుల చైతన్యసభలో… జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త గెటప్లో కనిపించారు. బ్లూ కలర్ కుర్తాపైజమా ధరించి వేదికపైకి వచ్చిన పవర్ స్టార్ మధ్య.. మధ్యలో కళ్లద్దాలు కూడా పెట్టుకున్నారు. కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ గురించి చదివి.. చదివి తనకు సైటొచ్చిందని చమత్కరించి అందరినీ నవ్వించారు.
సినిమాలో నటించినప్పటికి… తనకు ఆనందం లేదని.. సమస్యలపై పోరాడినప్పుడు ప్రజలకు అండగా ఉన్నప్పుడే.. ఆనందంగా ఉంటుందని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. ఇంక పవన్ మాట్లాడుతూ.. ‘రాయలసీమ ప్రజలకు అండగా ఉంటా.. మీ సమస్యలు నా సమస్యలు. అందుకే జనసేన పార్టీని అనంతపురం నుంచి ప్రారంభిస్తా.
అనంతపురం జిల్లాలో కరువు లేకుండా చేయడానికి కృషి చేస్తా’నని అన్నారు. అలాగే జనసేన పార్టీ విధానాల మీదే పోరాడుతుంది. జగన్, చంద్రబాబు.. ఎవరికి కూడా నేను వ్యక్తిగత శత్రువును కాదు. కానీ.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం శత్రువునే. రాజకీయ నాయకుల చెప్పిన మాటలు వినీ .. వినీ విసుగొచ్చింది. సమస్యలు పరిష్కారం అవ్వటం లేదు. భాషా సంస్కారం లేకుండా తిట్టుకోవడం కాదు. రాజకీయాలు అంటే ఏమిటో తెలియాలంటే..తరిమెల నాగిరెడ్డి రాసిన పుస్తకం చదవండి అని పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా ప్రసంగించారు.
{youtube}rp2TJgkf8sU{/youtube}
Related