Friday, May 10, 2024
- Advertisement -

చంద్రబాబుపై పవన్ కు అదే అభిమానం..!

- Advertisement -

ఒకవైపు పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఆందోళన కలుగుతోంది. రాజకీయంగా పవన్ తీసుకొన్న స్టాండు పై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వారంతా హ్యాపీ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయా రాజకీయ పార్టీలపై తీవ్రమైన విమర్శలే వస్తున్నాయి. 

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ విమర్శలను ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన నేతలు వసుంధరరాజే, సుష్మాస్వరాజ్ వంటి వారు తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వివాదాస్పద వ్యక్తి  అయిన లలిత్ మోడీతో సాన్నిహిత్యం వారిపై విమర్శలకు కారణం అవుతోంది. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు వస్తున్నాయి. ఆయన ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కొని విలవిల లాడుతున్నాడు. ఈ అంశంపై పవన్ స్పందించడం లేదని కొందరు.. ఇలాంటి అవినీతి పరులకా.. పవన్ మద్దతు పలికింది? అంటూ మరికొందరు విరుచుకుపడుతున్నారు.

మరి ఇప్పుడు పవన్ ఈ వ్యవహారాలను అస్సలు పట్టించుకోవడం లేదు కానీ.. అభిమానులు మాత్రం తమ హీరోపై ఇలాంటి విమర్శలు వస్తుండటాన్ని కొంత వరకూ సహించలేకపోతున్నారు. పవన్ స్పందింస్తే మేలని వీరు అభిప్రాయపడుతున్నారు. మరి వాళ్ల ఆందోళన ఇలా ఉంటే.. పవన్ కు మాత్రం తెలుగుదేశం అధినేతపై అభిమానం ఏ మాత్రం తగ్గినట్టుగా లేదు. ఎన్నికల సమయం నాటి అభిమానమే ఇప్పటికీ ఉందని తెలుస్తోంది. తాజాగా పవన్ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మామిడి పండ్లు పంపడమే దానికి రుజువు. దీన్ని బట్టి పవన్ మద్దతు ఇంకా తెలుగుదేశం పార్టీకే ఉందని స్పష్టంగా అర్థం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -