తెలుగుదేశం ఎంపీలతో వాదులాటకు దిగాడు జనసేనాని పవన్ కల్యాణ్. ప్రత్యేక హోదా అంశం గురించి తెలుగుదేశం ఎంపీలు సరిగా పోరాడటం లేదు.. అని మీడియా ముందు వ్యాఖ్యానించిన పవన్ పై టీడీపీ ఎంపీలు విరుచుకుపడ్డారు.
తమను విమర్శించేంత అర్హత పవన్ కు లేదని అంటూ వారు మీడియా ముందుకు వచ్చారు. తాము ప్రత్యేక హోదా అంశం గురించి ఏమేం చేశామో వారు వివరించారు.
అయితే పవన్ వాళ్లతో మళ్లీ సమాధానం చెప్పాడు. తనను తిట్టడం కాదు.. తనను తిడితే ఏమీ రాదు.. అంటూ పవన్ ట్వీటు పెట్టాడు. అంతటితో ఆగక పవన్ మరో అడుగు ముందుకేశాడు. ఎంపీలు పార్లమెంట్ హాజరీ గురించి ఒక లింకును ట్వీట్ గా పోస్టు చేశాడు. అయితే ఆ లింకుల సమాచారం లేదు! ఒకసారి కాదు రెండు సార్లు పవన్ ఆ లింకును పోస్టు చేశాడు.
రాష్ట్ర విభజన అంశం గురించి పార్లమెంటు చర్చ జరిగినప్పుడు ఎంతమంది ఎంపీలు హాజరయ్యారనే అంశం గురించి పవన్ పోస్టు చేసిన లింకు రెండో సారి కూడా ఓపెన్ కాలేదు. దీంతో పవన్ చివరకు మరో ట్వీటు పెట్టాడు. అందులో తనకున్న సమాచారం మేరకు.. కేవలం ఐదు మంది ఎంపీలు మాత్రమే రాష్ట్ర విభజన అంశంపై చర్చలో పాల్గొన్నారని పవన్ ట్వీట్ చేశాడు! అదీ కథ.