Friday, April 26, 2024
- Advertisement -

అఖిలపక్ష భేటీ తేదీ ఖరారు.. ఈసారి ఎందుకంటే..?

- Advertisement -

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరగనుంది. ఈ నెల 30న వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం పంపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి తెలిపారు.

పార్లమెంటు సమావేశాలకు ముందు అఖిల పక్ష భేటీ జరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఎప్పుడూ సమావేశాలకు ముందు జరిగే ఈ భేటీ.. ఈసారి ప్రారంభమైన ఒకరోజు తర్వాత జరగనుండటం గమనార్హం. ఈ నెల 29న పార్లమెంటు బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు రాజ్యసభ సమావేశాలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.. ఫిబ్రవరి 1న బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు. కొవిడ్​ నిబంధనల మధ్య సమావేశాల నిర్వహణపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో లోక్​సభ స్పీకర్​ మంగళవారం సమావేశం నిర్వహించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -