తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా ఆరువేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒకే రోజు 1,30,105 పరీక్షలు చేయగా.. 6,542 కేసులు వచ్చాయని పేర్కొంది వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఒక్కరోజులో కరోనాతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 2,887 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,67,901కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,19,537 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 898 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. ఇప్పటివరకు కరోనా వల్ల మొత్తం 1876 మంది చనిపోయారు. నిన్న జరిపినటెస్టుల్లో ఇంకా ఇంకా 6,242 మంది పరీక్షల రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. కరోనా సెకండ్ వేవ్తో తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.
ప్రైవేట్ టీచర్లకు నేటి నుంచి సన్న బియ్యం పంపిణీ!