Tuesday, April 30, 2024
- Advertisement -

విద్యుత్ షాక్ కు ముగ్గురు చిన్నారులు బలి…

- Advertisement -

ప్రకాశంజిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు చిన్నారు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

గ్రామంలోని కోదండరామస్వామి ఆలయ ప్రధాన కూడలి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండాను ఆ పార్టీ నేతలు ఏర్పాటుచేశారు. ముగ్గురు విద్యార్థులు ఆడుకోవడానికి ఆస్తంభాన్ని పట్టుకోగానె షాక్ తగిలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరణించిన వారు 5వ తరగతి విద్యార్దులు 1.షేక్ పఠాన్ గౌస్ (11), 2. షెక్ హసన్ బుడే (11), 3.పఠాన్ అమర్ (11) గా గుర్తించారు. నమాజ్ కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వైసీపీ జెండా రాడ్డును ముగ్గురు విద్యార్థులు పట్టుకొని అడుకుంటుండగా..ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు, కుటుంబసభ్యులు చెబుతున్నారు.

ముగ్గురు విద్యార్థుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పార్టీ జెండాను కరెంట్ తీగలు తగిలే చోట్ల ఏర్పాటు చేయడం వల్లనే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -