Friday, May 17, 2024
- Advertisement -

ప్ర‌కాశం జిల్లా వైసీపీ కీల‌క‌నేత ఇంట్లో తీవ్ర విషాదం..

- Advertisement -

కాశం జిల్లా వైసీపీ నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇంట్లో ఈరోజు విషాదం నెలకొంది. శివప్రసాద్ రెడ్డి తండ్రి, మాజీ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి మృతి చెందారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు వైసీపీ నేతలు ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతితో అభిమానులు, కార్యకర్తలు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఆదివారం మధ్యాహ్నం స్వగ్రామంలో బూచేపల్లి అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. అంతిమ సంస్కారాలకు జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.2004 ఎన్నికల్లో సుబ్బారెడ్డికి కాంగ్రెస్ దర్శి అసెంబ్లీ టికెట్ ను నిరాకరించింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు శివప్రసాద్ కాంగ్రెస్ తరఫున గెలిచి వైసీపీలో చేరారు. కానీ 2014 ఎన్నికల్లో శివప్రసాద్ ఓటమి పాలయ్యారు.సుబ్బారెడ్డి మృతి తో దర్శిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -