Wednesday, May 22, 2024
- Advertisement -

వాళ్ల కోసం రాహుల్ డబ్బులేమీ తీసుకురాడా..?!

- Advertisement -

నేతలు ఒట్టి ఓదార్పు యాత్రలు చేస్తే ఉపయోగం ఏమీ ఉండదు. రైతులను పరామర్శించడానికి అయినా..  ఏ ప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళ్లినా నేతలు తాము పరామర్శించే కుటుంబాల కోసం అంతో ఇంతో ఆర్థిక సాయం కూడా చేయడం కచ్చితంగా చేయాల్సిన పని.

ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీల్లో ఉండే వారికి ఇలాంటి పరామర్శ యాత్రలు చాలా అవసరం. 

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అయినా.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అయినా పరామర్శలకు వెళ్లినప్పుడు ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా అందించడం జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంల కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కూడా పరామర్శ యాత్రకు వస్తున్నాడు. ఇప్పటికే మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఒక యాత్రను చేపట్టిన రాహుల్ రెండో విడత యాత్రను తెలంగాణలో నిర్వహిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల మధ్య నిధుల గురించి చర్చ జరుగుతోంది. రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి డబ్బులను విరాళాల రూపంలో సేకరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ముందుగా వీ హనుమంతరావు లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించగా.. ఇప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి మరో లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. ఇతర నేతల కూడా ఇలాంటి విరాళాలతో రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు రాఆలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు.

రాహుల్ గాంధీ యాత్ర నేపథ్యంలో ఆయా కుటుంబాలకు ఈ నేతలు ఈ డబ్బును ఆర్థిక సాయంగా అందించనున్నారు. మరి ఢిల్లీ నుంచి రాబోయే రాహుల్ గాంధీ రైతుల కోసం ఆ మాత్రం డబ్బులు చేతబట్టుకోకుండానే వస్తున్నాడా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -