తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. సీనియర్ నటుడు దేవదాస్ కనకాల సతీమణి లక్ష్మీదేవి మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం మరణించారు. తెలుగు సినీ పరిశ్రమలో నటుడు దేవదాస్ కనకాల ఎన్నో సినిమాల్లో నటించారు. అతడి తర్వాత అతడి కుమారుడు రాజీవ్ కనకాల ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి మంచి పాత్రలు చేస్తూ గుర్తింపు పొందుతున్నారు. యాంకర్ సుమ వీరి ఇంటి కోడలు. ఇలా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కుటుంబంలో విషాదం నిండింది.
ఆమె మృతికి సినీ ప్రముఖులు, ఆర్టిస్టులు సంతాపం ప్రకటించారు. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (‘మా’) అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రధాన కార్యదర్శి వి.కె. నరేశ్ సంతాపం ప్రకటించి కుటుంబసభ్యులను పరామర్శించారు.
దేవదాస్, లక్ష్మీదేవి కలిసి ఎంతో మంది నటీనటులకు నటనలో పాఠాలు నేర్పించారు. నటనలో ఓనమాలు దిద్దించారు. వారి శిష్యులు ఎందరో సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. వారిలో రజినీకాంత్, చిరంజీవి, సుధాకర్, శుభలేఖ సుధాకర్, రాజేంద్రప్రసాద్ వంటి వారు ఉన్నారు.
ఇక దేవదాస్ అనేక సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. ఓ యాక్టింగ్ స్కూల్ను కూడా నడిపి తర్వాత మూసివేశారు. నటుడు రాజీవ్ కనకాల, ప్రముఖ యాంకర్ సుమ వీరి కుటుంబసభ్యులే.