శ్రీదేవి మరణంతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి గురించి ట్వీట్లు చేస్తూ ఆమెకు నివాళులర్పిస్తున్నారు. రెండు రోజులుగా వర్మ పోస్ట్లు పెడుతున్నారు. తాజాగా సినీ రచయిత లక్ష్మీ భూపాల రాసిన శ్రీదేవికి వీడ్కోలు లేఖను వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బాల్యం నుంచే శ్రీదేవి చాలా కోల్పోయిందని అందులో ఉంది. నాలుగేళ్ల వయసు నుంచే బాల్యాన్ని కోల్పోయావ్, అమ్మానాన్నలని బిడ్డల్లా పోషించావు..16 ఏళ్ల వయసులోనే కృతిమ వెలుగుజిలుగుల మధ్య సున్నితత్వాన్ని కోల్పోయావ్.. నీ కోసం నీవెప్పుడూ బతకలేదనే విషయాన్ని కూడా మర్చిపోయావ్.. వచ్చే జన్మలో అయినా నీవు నీ కోసం పుట్టమ్మా అని ఉన్న ఆ లేఖ కన్నీరు పెట్టిస్తోంది. ‘అమ్మా శ్రీదేవి’ అంటూ అతిలోక సుందరినీ అందులో సంబోధించారు.
Here’s a heartwrenchingly written tribute to Sridevi by #LakshmiBhupala pic.twitter.com/nzkWb7EFNV
— Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2018