- Advertisement -
అభివృద్ధి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో తాను పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఆయన శనివారం అనకాపల్లిలో మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఏమిటో హైదరాబాద్లో చేసి చూపించానని, ఆధునీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని చంద్రబాబు తెలిపారు.
రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. వ్యవసాయంతో సమానంగా అనుబంధ రంగాలను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖను టూరిస్ట్ హబ్ గా మార్చుతామని ఆయన హామీ ఇచ్చారు. గిరిజనుల ఆదాయం పెంపుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ చేసిన విభజన తీరు వల్ల కష్టాలు పెరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ఫీజులు చెల్లించి వారిని చదివించే స్తోమత ఉందని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తల కృషి వల్లే టీడీపీ గెలిచిందన్నారు.