Sunday, April 28, 2024
- Advertisement -

వై ఎస్ రాజశేకర్ రెడ్డి చెల్లికి అన్యాయం చేస్తున్న కెసిఆర్

- Advertisement -

ఆమెని వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్న రోజుల్లో చెల్లెమ్మా అని పిలిచేవారు. కాంగ్రెస్ లో వారు అందరూ చేవెల్ల చెల్లెమ్మ గా పిలుచుకునే సబితా ఇంద్రా రెడ్డి కి తాజాగా షాక్ తగిలింది. ఉమ్మడి రాష్ట్రం లో ముఖ్యంగా వై ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమెకి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.

ప్రతీ ప్రోగ్రాం నీ ఆమె చేతుల మీదగానే ప్రారంభించేవారు ఆయన. పాద యాత్ర సూపర్ డూపర్ హిట్ అవ్వడం అది చేవెల్ల నుంచి మొదలు అవ్వడం తో అదే సెంటిమెంట్ ఉండిపోయింది ఆయనకీ మనసులో. తెలుగు నేల మీద తొలి మహిళా హోం మంత్రిగా సబితాఇంద్రారెడ్డి రికార్డు సృష్టించారు.  వైఎస్ జమానా ముగిసిన తర్వాత ఆమె ప్రాధాన్యత తగ్గిందనే చెప్పాలి. తర్వాతి కాలంలో హోం మంత్రి పదవి నుంచి మారటం ఒకటైతే..సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ గాలికి సబితా ఇంద్రారెడ్డి ఓటమిపాలు కావటంతో ఆమె మాజీగా మారిపోయారు.

అయితే.. మాజీ హోంమంత్రి కింద ఆమెకు గన్ మెన్లను ప్రభుత్వం ఇస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మాజీ హోంమంత్రిగా సబితాఇంద్రారెడ్డికి కల్పిస్తున్న భద్రతను ఇకపై కొనసాగించలేమంటూ కేసీఆర్ ప్రభుత్వం ఆమెకు ఓ లేఖలో స్పష్టం చేశారు. తక్షణమే గన్ మెన్లను ఉపసంహరించుకుంటున్నట్లుగా సబితమ్మకు రాసిన లేఖలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో సబితా ఇంద్రారెడ్డికి ప్రస్తుతం రక్షణగా ఉన్న గన్ మెన్లు ఏక్షణంలో అయినా వైదొలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 

Related

  1. కెసిఆర్ దెబ్బకి మీడియా నోరు మూస్కుంది
  2. కెసిఆర్ vs చంద్రబాబు
  3. మోడీ ని వశం చేసుకుంటున్న కెసిఆర్ ?
  4. కెసిఆర్ జీతం ఎంత చంద్రబాబు జీతం ఎంత ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -