Friday, April 19, 2024
- Advertisement -

కొడాలికి ఎస్ఈసీ నిమ్మగడ్డ షాక్.. సాయంత్రం లోగా సమాధానం ఇవ్వాలి..!

- Advertisement -

ఏపీ మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షాకిచ్చారు. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.. ఎస్ఈసీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా వివరణ ఇవ్వాలని ఎస్ఈసీ సూచించింది.

ఎన్నికల కమిషన్ పరువు, ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాట్లాడారంటూ నోటీసు ఇచ్చింది. ఈసీ ప్రతిష్ఠను దిగజార్చేలా దురుద్దేశ ప్రకటనలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. మీడియా సమావేశంలో వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని కోరింది. కాగా, రేషన్ డోర్ డెలివరీ వాహనాలపై సీఎం జగన్ బొమ్మ, వైఎస్సార్‌సీపీ జెండా రంగులు ఉండటంతో ఉపయోగించరాదని ఆదేశాలు ఇచ్చారు.

దీనిపై జగన్ సర్కార్ కోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. ఇంతలోనే మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేయడం.. ఆ వెంటనే ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు కొడాలినాని బహిరంగ ప్రకటన చేయాలని… సాయంత్రం 5 గంటల్లోగా మంత్రికానీ, ప్రతినిధి ద్వారా కానీ సమాధానం ఇవ్వాలని ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

జీతాల పై బండి ధ్వజం.. వారి పరిస్థితి దారుణం..!

మ‌హేష్, రాజ‌మౌళి క్రేజీ కాంబో..జంగిల్ అడ్వెంచ‌ర‌స్ మూవీ

తెలంగాణా లో కొత్త సేవలు.. మొత్తం అక్కడ నుంచే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -