Friday, April 19, 2024
- Advertisement -

భారత్ లో రహస్య స్థావరం..26రౌండ్ల ఏకే-47 బుల్లెట్లు స్వాధీనం..!

- Advertisement -

లష్కరే తోయిబా ఉగ్రవాదికి చెందిన రహస్య స్థావరాన్ని ధ్వంసం చేశారు జమ్ముకశ్మీర్​ పోలీసులు. పుల్వామాలోని పాంపోర్​లో ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశారు.ఉగ్రవాద స్థావరానికి సంబంధించి తమకు సమాచారం అందగానే అవంతిపొరా పోలీసులు అప్రమత్తమయ్యారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఛంధార గ్రామంలో ఈ స్థావరాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఉగ్రవాది స్థావరం నుంచి 26రౌండ్ల ఏకే-47 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దుస్తులు, ఇతర వస్తువులు ఆ స్థావరంలో లభ్యమైనట్లు పేర్కొన్నారు.మరోవైపు.. జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది పాకిస్థాన్. తాజాగా రాజౌరీ, పుంఛ్​, కతువా జిల్లాలో మోర్టార్​ షెల్స్​తో దాడికి దిగింది. పాక్​ దుశ్చర్యకు భారత్​ దీటుగా బదులిచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు పాక్ ఈ చర్యకు పాల్పడినట్లు భద్రతాదళ ప్రతినిధి పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -