- Advertisement -
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహానికి వెల్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ ఏడుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెనుకొండ మండలం సత్తారుపల్లి వద్ద కారు, టెంపో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సమాచారమందుకున్న స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.