- Advertisement -
బాంబు దాడుల నేపధ్యంలో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.దేశ వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధరించడంపై నిషేధం విధించింది. ముఖానికి ఎవరూ ఎటువంటి ముసుగూ ధరించరాదని స్పష్టం చేసింది.ఈస్టర్ రోజు జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన స్పష్టం చేశారు.