Friday, May 10, 2024
- Advertisement -

స్టాక్ మార్కెట్ల‌కు మ‌రో బ్లాక్ డే …

- Advertisement -

దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈరోజు మరో బ్లాక్ మండేగా నిలిచింది. రూపాయి విలువ పతనమవుతుండటంతో పాటు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాల ప్రభావం మార్కెట్లపై పడింది. దీనికి తోడు రూపాయి విలువ పతనాన్ని నిలువరించడానికి అనవసరమైన దిగుమతులను నిషేధిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన కూడా ఇన్వెస్టర్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి.

మోద‌ట్లో లాభాలతో ప్రారంభమైన కీలక సూచీలు అమ్మకాలు ఊపందుకోవడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 505 పాయింట్లు పతనమై 37,585 వద్ద, నిఫ్టీ 138పాయింట్లు కోల్పోయి 11,376 స్థాయికి చేరింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ నెట్ వర్క్స్ (14.74%), అవంతి ఫీడ్స్ (13.14%), మోన్శాంటో ఇండియా (10.73%), వెంకీస్ ఇండియా (10.00%), సుజ్లాన్ ఎనర్జీ (9.00%).

టాప్ లూజర్స్:
అశోకా బిల్డ్ కాన్ (-6.08%), క్వాలిటీ (-4.88%), రెడింగ్టన్ ఇండియా (-4.34%), ఐసీఐసీఐ లొంబార్డ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ (-4.30%), బాటా ఇండియా (-4.25%).

ఈనాటి ట్రేడింగ్ లో మొత్తం 957 స్టాకులు నష్టాలను మూటకట్టుకోగా… 796 స్టాకులు లాభాలను చవిచూశాయి. నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, సన్ ఫార్మా తదితర పెద్ద సంస్థలు 2 నుంచి 3 శాతం వరకు నష్టపోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -