Monday, April 29, 2024
- Advertisement -

బాబుగారి చెరువునుంచి చేజారుతున్న చేప‌లు…

- Advertisement -
TDP Cadre Jumping to YSRCP .. Shock to AP CM Chandrababu

అధికారం ఉన్నా కాపాడుకోలేని స్థిలో చంద్ర‌బాబు ఉండ‌టం ఆయ‌న దౌర్భాగ్యానికి నిద‌ర్శ‌నం. అయితే దీన్ని లైట్‌గా తీసుకుంటె బాబుకు చుక్క‌లే. గండిపడటానికి ముందు చిన్న లీకేజీనే కన్పిస్తుంది.. ఆ తర్వాతే ప్రవాహం జోరు పెరుగుతుంది. టీడీపీకి కూడా ఆ తరహాలో గండి పడేందుకు ముహూర్తం దగ్గరపడిందనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఎప్పుడూ నీతిగురించి మాట్లాడే చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష‌పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు తాయిలాల ఎర‌వేని పార్టీ పిరాయింపుల‌ను ప్రోత్స‌హించారు.ఎలాగోలా విజ‌యం సాధించారు.క‌ని అది ఇప్పుడు బాబు మెడ‌కు చుట్టుకుంది.పిరాయింపులు అధికారం అనే వాపు త‌ప్ప బ‌లం కాద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం.

{loadmodule mod_custom,GA1}

మూడు సంవ‌త్స‌రాల పాల‌న‌ను దిగ్విజ‌యంగా పూర్తి చేసుకున్నారు.2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర కొస్తున్నాయి.ఇప్ప‌టికే టీడీపీతో పొత్తు ప్ర‌స‌క్తేలేద‌ని ఒంట‌రిగా పోటీచేస్తామ‌ని క‌మ‌ల‌దళం ప్ర‌క‌టించింది.ఇక ప‌వ‌ణ్ క‌ళ్యాన్‌కూడా ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని తేల్చి చెప్పారు.మ‌రి అప్పుడు బాబు పస్తితి కుడితిలో ప‌డిన ఎలుక‌లాగా త‌యార‌వుతుంది.
స‌మీక‌ర‌నాలు ఎప్పుడైనా మారిపోవ‌చ్చు అందుకేనేమొ బాబుగారి చెర‌వులో ఉన్న చేప‌లు ఒక్కొక్క‌టి జారుకుంటున్నాయి.మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత శిల్పా మోహన్‌రెడ్డి, ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పేస్తున్నారు. వైఎస్సార్సీపీలోకి జంప్‌ చేసేయడం ఖాయమని ప్రకటించేశారు.ఇది క‌ర్నూలులో బాబుకు పెద్ద షాకే.ల‌క్ష‌మందితో వైసీపీలోకి చేరి టీడీపీకి దిమ్మ‌తిరిగేలా ప్లాన్ వేస్తున్నారు.

{loadmodule mod_custom,GA2}

2019 లో నియేజ‌క వ‌ర్గాలు పెర‌గ‌నున్నాయ‌ని వైసీపీ నేత‌ల‌కు ఆశ చూపించి..క‌హానీలు చెప్పిన బాబ‌ ఇప్పుడు చెయ్య‌డానికి ఏమీలేదు.కేంద్రం నియేజ‌క వ‌ర్గాలు పెర‌గ‌వ‌ని ఖ‌రాకండీగా చెప్పింది.ఇక‌ నియోజకవర్గాలు పెరిగే ఛాన్స్‌ కన్పించడంలేదు. దాంతో, టీడీపీ నుంచి రానున్న రోజుల్లో పెద్దయెత్తున వలసలు తప్పకపోవచ్చన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}lUR0W5r9QTQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -