Monday, April 29, 2024
- Advertisement -

అబద్దాలే..పచ్చమంద ఎజెండా

- Advertisement -

బిల్డప్ లు ఎలివేషన్లు ఇవ్వడంలో టీడీపీ వాళ్ళను మించినవాళ్లు లేరు.. తాము ఓడిపోతున్నామని తెలిసినా సరే..క్యాడర్ను నిలబెట్టుకునేందుకు తప్పుడు ప్రచారాలు ..అవాస్తవాలు సర్క్యులేట్ చేసి సంతోష పడుతున్నారు.

గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ చావుతప్పి కన్ను లోట్టబోయిన తీరున ఫలితాలు సాధించిన టీడీపీ ఇప్పుడు వరల్డ్ కప్పు కొట్టబోతున్న రీతిలో విల్డప్పులు ఇస్తోంది.ఉమ్మడి ఏపీలో 2004 ఎన్నికల్లో టీడీపీ 34 సీట్లు . 2009 లో 53 స్థానాలు సాధించారు. ఇక 2014లో జనసేన బిజెపి తో కలిపి పోటీ చేసి..మోడీ కి ఉన్న విపరీతమయిన వేవ్లో కూడా వాళ్ళు తెచ్చుకున్నది 102 సీట్లే. 2019 లో అయితే 23 సీట్లకే పరిమితమైంది. ఇంత దరిద్రమైన ట్రాక్ రికార్డ్ ఉన్న టీడీపీ 2024 లో మాత్రం 160 సీట్లు గెలుస్తామని బిల్డప్పులు ఇస్తోంది.

ఇప్పటివరకు మూడుపార్టిలకు పొత్తులో సీట్ల షేరింగ్ ఇంకా జరగలేదు. ఇటు చూస్తే చంద్రబాబు సభలకు రెస్పాన్స్ నిల్. చిలకూరిపేట సభ పై భారీ అంచనాలు పెట్టుకున్నా అది కాస్త తుస్ మంది. ప్రధాని మోడీ జగన్ పై గట్టిగా విమర్శలు చేస్తారని, చంద్రబాబు ను గెలిపించమని చెబుతారని ఆశించారు అదీ జరగలేదు.ఇంత దారుణమైన పరిస్థితుల్లో 160 సీట్లు వస్తాయని ఎలా భ్రమపడుతున్నరో వారికే ఎరుక.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -