నంద్యాల ఉప ఎన్నికల ప్రాచరం ఈరోజుతో ముగియనుంది. గెలుపు పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా ఉంటె…టీడీపీకి మాత్రం కోలుకోలేని దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పుడు తాజాగా అధికారపార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. నేతల జంపింగ్లు కొనసాగుతూనే ఉన్నాయి.
నంద్యాలలో ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు హఠాత్తుగా ఫరూక్ను ఎమ్మెల్సీని చేశారు చంద్రబాబు. అయితే ఇప్పుడు ఫరూక్కు ఆయన సొంత మేనల్లుడే షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఫరూక్ మేనల్లుడు , హరూన్ మోటార్స్ అధినేత ముస్తాక్ వైసీపీలో చేరారు. ముస్తాక్ ఇంటికి జగన్ నేరుగా వెళ్లారు. ఈ సమయంలో ముస్తాక్, ఆయన అనుచరులు వైసీపీలో చేరారు.
నంద్యాలలో కీలకమైన ముస్లిం మైనార్టీ ఓట్లు గెలుపు ఓటములపై ప్రభావం చూపనున్నాయి. ఈ తరుణంలో ఫరూక్ మేనల్లుడు టిడిపిని వీడడం ఆ పార్టీకి షాకిచ్చింది.వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి విజయం కోసం కృషిచేస్తానని ముస్తాక్ ప్రకటించారు. ఇది టీడీపీకి కోలుకోలేని దెబ్బ.