- Advertisement -
పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో టీడీపీకీ చెందిన సీనియర్ నేత తాడేపల్లి కాంతారావు (54) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన మరో వ్యక్తితో కలిసి భోగోలు నుంచి లింగపాలెంకు బైకు మీద వెళ్తుండగా.. మఠంగూడెం వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కాంతారావు అక్కడిక్కడే మృతి చెందారు. బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాంతారావు మృతి విషయం తెలిసి టీడీపీ నేతలు ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు. కాంతారావుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత పాతిక సంవత్సరాలుగా కాంతారావు టీడీపీ కి సేవలు అందిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.