రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే 20 వేల పోలీసు పోస్టులను భర్త చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. త్వరలోనే పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని హోమ్ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ.. 33 శాతం రిజర్వేషన్ కల్పించామని అలీ పేర్కొన్నారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పోలీస్ శాఖలో వివిధ వివిభాగాల్లో దాదాపు 80వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినట్టు మహమూద్ అలీ తెలిపారు. తగినన్నీ నిధులు కేటాయించడం ద్వారా పోలీసుశాఖ నూతన వాహనాలు సమకూర్చుకోవడం గానీ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ సమర్థ పోలీసింగ్ను నిర్వహిస్తుందన్నారు.
తెలంగాణాలో భారీ సంఖ్యలో సీసీకెమెరాలను ఏర్పాటు చేశామమని చెప్పారు. వీటి సంఖ్య దేశంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో 70 శాతం తెలంగాణలోనే ఉన్నాయని.. వీటి సాయంతో కేసులను ఈజీగా చేధిస్తున్నారని.. ఇంకా చెప్పాలంటే ఈ సీసీ కెమెరా ఏర్పాట్లతో నేరాలు చేయాలంటే భయపడుతున్నారని అలీ చెప్పారు.