బిగ్బాస్ రెండో సీజన్ను తనదైన శైలిలో నడిపిస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇక ఈ శనివారం వచ్చిన నాని వచ్చి రావడంతోనే షోలోని హోస్మెట్స్పై విరుచుకుపడ్డాడు. షోలోని హోస్మెట్స్ ఈ వారం చేసిన తప్పులను ఎత్తి చూపిస్తు వారికి నిదానంగా కౌంటర్ ఇచ్చాడు,తేజస్వీ,భాను శ్రీ వల్గర్ మాటలను తప్పు పట్టిన నాని ,వారి తీరును మార్చుకోవాలని హితవు పలికాడు. గీత మాధురికి ఫ్యాన్ అయ్యానని నాని తెలిపాడు. ఇక తనిష్ నీ గేమ్ నువ్వు ఆడు ,సునైనా గేమ్ సునైనా ఆడుతుంది.
సునైనా గేమ్ కూడా నువ్వే ఆడుతున్నావని తనీష్ని హితబోద చేశాడు. షోలో ఉన్న అందరితో మాట్లాడిని నాని ఒక్క సామ్రాట్తో మాట్లాడే అప్పుడు మాత్రం తేజస్వీతో మాట్లాడాను కదా నీతో మాట్లాడల్సిన అవసరం లేదని సామ్రాట్కు ఘలక్ ఇచ్చాడు నాని. దీంతో మధ్యలో కలుగజేసుకున్న సామ్రాట్ నానిగారు నన్ను కూడా ఏదో ఒకటి అడగండీ,నాకు పిచ్చి ఎక్కుతుంది అని నానిని కోరాడు. దీనికి నాని తనదైనశైలిలో సమాధానం ఇచ్చాడు.తేజస్వీతో మాట్లాడితే నీతో మాట్లాడల్సిన అవసరం లేదంటూ అతనితో మాట్లాడలదు నాని.
సామ్రాట్ షో మొదటి నుండి తేజస్వీ ఏది చేబితే అది చేస్తు ఆమె వెనకాలే తిరుగుతున్నాడు. టాస్క్లు కూడా ఇద్దరు కలిసే చేస్తున్నారు. ఇది గమనించిన నాని తేజస్వీతో మాట్లాడితే సామ్రాట్తో మాట్లాడల్సిన అవసరం లేదని భావించాడు. సామ్రాట్ ప్రవర్తనపై నాని వ్యవహరించిన తీరును అందరు ప్రశంసిస్తున్నారు.