Friday, May 17, 2024
- Advertisement -

ఆ దంపతులకు 15 మంది పిల్లలు!

- Advertisement -

సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసిన దశరథ మహారాజు గురించి చదువుకున్నాం. కానీ.. 14 మంది అమ్మాయిలు పుట్టిన తర్వాత కూడా.. కొడుకు కోసం ఓ మహిళ ప్రయత్నించింది. 15వ సారి తన కల తీర్చుకుంది. ఇప్పుడు ఇంకో కొడుకు కావాలన్న ఆరాటంతో.. గుజరాత్ లోని ఝురీభుజ్హీ అనే ఓ కుగ్రామంలో ఉండే మహిళ.. కానూ సంగోద్… 16వ సారి కూడా గర్భవతి అయ్యింది.

పెళ్లి అయిన దగ్గర్నుంచి… కొడుకు పుట్టేదాకా ఆగే ప్రసక్తే లేదన్నట్టు… ప్రయత్నించిన కానూసంగోద్, రామ్‌సిన్హా దంపతులు.. మొదటి కాన్పు నుంచి మగబిడ్డ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. 14 సార్లు ప్రయత్నించినా.. అందరూ అమ్మాయిలే పుట్టడంతో.. ఫైనల్ గా 15వ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు.

ఇప్పటికే 15 మంది పిల్లలు పుట్టారు… అందులో ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. మళ్లీ గర్భం ఎందుకని అడిగిన వాళ్లకు… ఇంకో కొడుకు కోసమే అని కానూ సంగోద్ రిప్లై ఇస్తోందట. ఉన్న పిల్లలనే పోషించలేక… ఐదుగురినే స్కూలుకు పంపిస్తూ.. మిగిలిన వాళ్లను వ్యవసాయ పనులకు తీసుకెళ్తున్న ఆ జంట.. ఇప్పుడు పదహారో సంతానం కోసం ప్రయత్నించడం.. ఎందుకంటూ అయిన వాళ్లు కూడా సలహా ఇస్తున్నారట.

కానీ.. తమ ఇంట్లో సంప్రదాయం ప్రకారం.. అబార్షన్లు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఉండవని చెబుతున్న కానూసంగోద్, రామ్ సిన్హా.. మళ్లీ కొడుకే పుడతాడని నమ్మకంగా ఉందంటున్నారు.

స్టోరీ డిఫరెంట్ అయినా… ఈ పిల్లలను, వాళ్ల అమ్మానాన్నను చూస్తుంటే.. పవన్ కళ్యాణ్, భూమిక ఖుషీ సినిమా క్లైమాక్స్ గుర్తొస్తోంది కదూ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -