సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ తొలిసారిగా విద్వేషపూరిత సమాచారంపై వివరాలు వెల్లడించింది. మూడో త్రైమాసికంలో ప్రతి 10 వేల పోస్టుల్లో 10 నుంచి 11 (0.1శాతం) ద్వేషపూరిత సంభాషణలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు కమ్యూనిటీ స్టాండర్డ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ పేరిట నివేదిక విడుదల చేసింది.
కృత్రిమ మేధలో పెట్టుబడులు పెట్టడం వల్ల విద్వేషపూరిత సంభాషణలను వేగంగా తొలగించగలిగామని ఫేస్బుక్ తెలిపింది. వినియోగదారులు ఫిర్యాదు చేయకముందే చర్యలు తీసుకున్నామని పేర్కొంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 2.21 కోట్ల ద్వేషపూరిత సంభాషణలపై చర్యలు తీసుకున్నామని, వీటిలో 95 శాతం ముందుగానే గుర్తించామని తెలిపింది.
ఇన్స్టాగ్రామ్లో మొత్తం 65 లక్షల పోస్టులపై చర్యలు తీసుకోగా.. వీటిలోనూ 95 శాతం ఫిర్యాదు అందకముందే తొలగించామని నివేదికలో పేర్కొంది ఫేస్బుక్.
త్వరగా భోజనం చేయటం లేదా? అయితే ఇది చదవండి!