Sunday, May 19, 2024
- Advertisement -

అమెరికాలో ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి..!

- Advertisement -

మహబూబ్​నగర్​ జిల్లా మరికల్​ మండలం పెద్దచింతకుంటకు చెందిన జి.నరసింహారెడ్డి, లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. నరసింహరెడ్డి హైదరాబాద్​-1 డిపోలో కండక్టర్​గా పనిచేస్తున్నారు. పిల్లలు ఇద్దరు అమెరికా టెక్సాస్​లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు. 6 నెలల క్రితం కుమారుడు, కుమార్తె వద్దకు నరసింహరెడ్డి దంపతులు వెళ్లారు.

కుమార్తె వివాహం కుదుర్చుకునేందుకు టెక్సాస్​ వెళ్లగా.. అక్కడ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో దంపతులు నరసింహారెడ్డి, లక్ష్మి, కుమారుడు భరత్​రెడ్డి మృతి చెందారు. కుమార్తె మౌనికకు ప్రమాదంలో తీవ్రగాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు బంధువులు అక్కడే ఉన్న తానా/ఆట సంఘం సభ్యులను సంప్రదిస్తున్నారు. నరసింహారెడ్డి హైదరాబాద్​లోని సంతోష్​నగర్​లో నివాసం ఉంటున్నారు.

మొదటి లవ్​ జిహాద్ కేసు నమోదు..!

ఉపాధ్యక్షురాలికి 14 ఏళ్ల బాలుడు ఇచ్చిన గిఫ్ట్..!

నిర్లక్ష్యం పై మోదీ క్లాస్..!

మొదటి లవ్​ జిహాద్ కేసు నమోదు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -