ఉత్తర్ప్రదేశ్లో ‘లవ్ జిహాద్’కు సంబంధించి తొలి కేసు నమోదైంది. ఈ చట్టం అమలైన తర్వాత తొలిసారి బరేలీలో బలవంతపు మత మార్పిడి కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. యోగి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్సుకు గవర్నర్ ఆనందీబెన్ పటేల్ శనివారం ఆమోదముద్ర వేశారు.
తాజా ఆర్డినెన్సును అనుసరించి దేవరానియా పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. నిందితులపై సెక్షన్ 3/5 ప్రకారం ఆరోపణలు మోపారు. బలవంతంగా మత మార్పిడిని ప్రోత్సహించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో ఉత్తర్ప్రదేశ్ సహా బీజేపి పాలిత రాష్ట్రాలైన హరియాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ తరహా ఆర్డినెన్సులు తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. ప్రేమ, పెళ్లి పేరిట హిందు మహిళలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మారేలా చేస్తున్నారని, వాటిని అరికట్టేందుకు ఈ ఆర్డినెన్సులు ఉపయోగపడతాయని చెబుతున్నాయి. ఈ బలవంతపు మత మార్పిడులనే ‘లవ్ జిహాద్’గా అభివర్ణిస్తున్నాయి.
వామ్మో.. పుష్ప లో తోమ్మిది మంది విలన్స్ అంటా..?
అవును మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాం..!