Saturday, April 20, 2024
- Advertisement -

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..

- Advertisement -

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. మొత్తం 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ ను కృష్ణా జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా ఎల్ఎస్ బాలాజీరావును నియమించారు. మైనారిటీ సంక్షేమ స్పెషల్ సెక్రెటరీగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.

అనంతపురం జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన గంధం చంద్రుడును గ్రామ, వార్డు సచివాలయాల విభాగం డైరెక్టర్ గా నియమించారు. పాడేరు ఐటీడీవో పీవోగా గోపాలకృష్ణ రోణంకిని నియమించారు. మరోవైపు సీఎం సలహాదారు, నవరత్నాల అమలు కమిటీ ఉపాధ్యక్షుడు ఎం.శామ్యూల్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. కొత్తగా నియమితులైన జాయింట్ కలెక్టర్ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా కెఎస్ విశ్వనాధన్
కడప జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా జాహ్న ధ్యానచంద్ర
తూర్పుగోదావరి జిల్లా జేసీగా (హౌసింగ్)గా జాహ్నవి
కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా ఎన్.మౌర్య
కృష్ణ జిలా జేసీ (హౌసింగ్)గా ఎన్.అజయ్ కుమార్
పశ్చిమ గోదావరి జిల్లా జేసీ (హౌసింగ్)గా సూరజ్ ధననుంజయ్
చిత్తూరు జిల్లా జేసీగా (హౌసింగ్)గా ఎస్.వెంకటేశ్వర్
నెల్లూరు జిల్లా జేసీ (హౌసింగ్)గా వైదేహ్ ఖరే
విశాఖ జిల్లా జేసీగా (హౌసింగ్)గా కల్పనా కుమారి
విజయనగరం జిల్లా జేసీ (హౌసింగ్)గా మయూర్ అశోక్
శ్రీకాకుళం జిల్లా జేసీ (హౌసింగ్)గా హిమాన్షు కౌశిక్
గుంటూరు జిల్లా జేసీ (హౌసింగ్)గా అనుపమ అంజలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -