చాలా కాలం నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ ఎట్టకేలకు మంచి విజయాన్ని తన ఖాతలో వేసుకున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన నాంది సినిమా మంచి విజయం సాధించడంతో అల్లరి నరేష్తో సినిమాలు చేయడానికి ఇతర దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు ఈ అల్లరోడి దగ్గరకు పలువురు దర్శకలు కథలను వినిపించడానికి వచ్చినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే అగ్ర నిర్మాత దిల్ రాజు.. అల్లరి నరేష్కు మంచి ఆఫర్ ప్రకటించాడు. ఏకంగా అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాకు ఎలాంటి సంబంధంల లేకపోయిన ప్రత్యేక అభినందన సభను దిల్రాజు ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగానే దిల్రాజు మాట్లాడుతూ.. మంచి కథతో తన దగ్గరకు వస్తే బడ్జెట్ కు వెనుకడుగు వేయకుండా సినిమా తీస్తానని వెల్లడించాడు.
అలాగే, ఈ సినిమాతో తనకు ఎలాంటి సంబంధం లేదు కానీ సినిమా గురించి అందరూ పాజిటివ్గా స్పందించడం, ప్రేక్షకుల నుంచి స్పందన రావడంతో ఈ సినిమా చూశానని దిల్ రాజు చెప్పాడు. తనకు ఎంతగానో నచ్చిందనీ, ఈ క్రమంలోనే సినిమాకు తన వంతు బాధ్యతగా ప్రమోట్ చేయాలని భావించి.. ఈ అభినందన సభ ఏర్పాటు చేశానని తెలిపారు. అల్లరి నరేష్తో త్వరలోనే సినిమా చేస్తానని చెప్పారు.
15యేళ్ల తర్వాత మెగాస్టార్ కు జోడిగా ఆ ముద్దుగుమ్మ!
మిస్సెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలుగు యువతి !