రైలులోనే నిర్వర్తించాల్సిన టీటీఈ ఓ పనికిరాని పని చేసి.. అడ్డంగా పట్టుబడ్డాడు. కన్యాకుమారి టూ ముంబై వెళ్లే రైలులో టీటీఈ రాసలీలలను ప్రయాణీకులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఫొటోలు కూడా తీశారు. ఆ రైలు లో ఏసీ బీ2 కోచ్లో విధులు నిర్వర్తిస్తున్న టీటీఈ సత్యబాబు డ్యూటీకి వస్తూనే తనతోపాటు ఒకమహిళను కూడా వెంట తెచ్చుకున్నాడు.
కోచ్ లోని ఒక బెర్తును ఎవరికీ కేటాయించకుండా తనకోసం ఉంచేసుకున్నాడు. అందులో తనతో తెచ్చుకున్న మహిళతో కలిసి రాసలీలలు కొనసాగిస్తున్నాడు. తెల్లవారుజామున ప్రయాణికులు మంచి నిద్రలో ఉండగా సత్యబాబు రాసలీలలు మొదలెట్టాడు. ఇంతలో రైలులో ఉన్న ప్రయాణికులు మేలుకున్నారు. వారు అటుగా వెళ్తుండగా.. సత్యబాబు చేస్తున్న శృంగారాన్ని గమనించారు. వెంటనే తమ ఫోన్ లో కొందరు సత్యబాబు రాసలీలలను వీడియో తీయగా మరికొందరు ఫొటోలు తీశారు.
వారిని చూసి సర్దుకున్న సత్యబాబును పబ్లిక్ గా ఇలా చేయవచ్చా అని ప్రయాణికులంతా నిలదీశారు. దాంతో సత్యబాబు వారితో వాగ్వివాదానికి దిగాడు. ఇంతలో రైలు కడపకు రావడంతో టీటీఈతో ఉన్న మహిళ రైలు దిగి వెళ్లిపోయింది. ఆ తర్వాత టిటిఈ కూడా రైలు దిగి పరారయ్యాడు. ప్రయాణికులు తీసిన వీడియోలు, ఫోటోలు.. రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుకు సోషల్ మీడియాద్వారా పంపి సత్యబాబుపై ఫిర్యాదు చేశారు.
Related