సామాన్యులకు కాదు ప్రజా ప్రతినిధులను మోసం చేయడానికి కేటుగాళ్లు తెగబడుతున్నారు.. అధికారం, టెక్నాలజీ వంటి సదుపాయాలు ఉన్న నేతల దగ్గరే వారి వేషాలు చూస్తుంటే ఏమనాలో అర్థం కావట్లేదు.. ప్రస్తుతం మిగిలి క్లాస్ ప్రజలను చాలామంది దోపిడీ దారులు కొత్త రకం తరహా దోపిడీ లు చేస్తున్నారు.. దాంతో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ప్రజలు క్యూలు కడుతున్నారు.. అయితే ఎంత ట్రై చేసినా ఓ కొత్త రకం ప్లాన్ తో ప్రజలను దోచుకుంటూనే ఉన్నారు..
తాజాగా ఓ కేటుగాడు కేంద్ర ప్రథకం పేరు చెప్పి అనంతపురం జిల్లా కల్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ దగ్గర డబ్బులు కాజేయబోయాడు.. కానీ తన చాకచక్యంతో ఆమె ఆ కేటుగాడు ప్లాన్ ని విఫలం చేసింది.. నియోజకవర్గానికి రూ.3 కోట్లు కేంద్రం కేటాయించిందంటూ ఇండస్ట్రీస్ ప్రాజెక్టు డైరెక్టర్ పేరుతో ఎమ్మెల్యేకు శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. లబ్ధిదారుల వాటా కింద 10 శాతం చెల్లిస్తే యూనిట్కు రూ.25 లక్షల రుణం ఇస్తామంటూ హామీ ఇచ్చాడు. దాంతో ఆ మహిళా ఎమ్మెల్యే అతను నమ్మే విధంగా మాట్లాడి కొన్ని రోజులు వాయిదా అడిగే ప్రయత్నం చేసింది..
ఆ తర్వాత తాను మాట్లాడిన మాటలకూ అనుమానం వ్యక్తి చేసిన ఆమె వెంటనే ఆ కేంద్ర ప్రభుత్వం పథకం గురించి పరిశ్రమలశాఖ అధికారులను ఆరా తీశారు. అయితే ఆమె అనుమానాన్ని నిజం చేసేలా అధికారులు అలాంటి పథకమేమీ లేదని చెప్పారు. దీంతో జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే ఉషశ్రీ ఫిర్యాదు చేశారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ఎస్పీని ఎమ్మెల్యే కోరారు. ఫోన్ నంబర్ను ట్రేస్ చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునే పనిలో పోలీసు బృందాలు నిమగ్నమయ్యాయి.