Tuesday, April 30, 2024
- Advertisement -

ఖమ్మం సీటుపై మరోసారి వీహెచ్‌!

- Advertisement -

ఖమ్మం ఎంపీ స్థానంపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు పార్టీ సీనియర్ నేత వీ హన్మంతరావు. ఖమ్మం అభ్యర్థి కోసం కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. భట్టి విక్రమార్క తన సతీమణి నందిని,మంత్రి పొంగులేటి తన సోదరుడి కోసం, మంత్రి తుమ్మల తన తనయుడి కోసం ప్రయత్నాలు చేస్తుండగా సీటు ఎవరికి దక్కుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఖమ్మం సీటు ఆశీంచి భంగపడ్డ వీహెచ్..మరోసారి స్పందించారు. గత ఎన్నికల్లోనే ఖమ్మం నుంచి పోటీ చేయాలనుకున్నానని కానీ రాజీవ్ గాంధీ ఆలోచన మేరకు ట్రైబల్ ఏరియా ఉన్న.. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అనుకున్నా అన్నారు. అందుకే ఖమ్మంలో ప్రతీ సమస్యపై పోరాటం చేశానని తెలిపారు. తొలుత భట్టి విక్రమార్కే తనను ఖమ్మం నుండి పోటా చేయాలని చెప్పారని కానీ ఇప్పుడు ఆయన భార్యకు కావాలని అంటున్నారన్నారు.

తనకు రేవంత్ రెడ్డి మద్దతు ఉందని, హైకమాండ్ ఎవరికి ఇస్తే వారి తరపున ప్రచారం చేస్తానని చెప్పారని అది మిగితా నేతలకు మింగుడు పడటం లేదన్నారు. రాష్ట్రంలో బీసీలకు మూడు ఎంపీ సీట్లు మాత్రమే ఇచ్చారు..అందుకే ఖమ్మం సీటును బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు వీహెచ్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -