ఎన్నికళ వేళ ఏపీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ సాధీనం కావడం సంచలనంగా మారింది. విశాఖ పోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్ పట్టుబడగా బ్రెజిల్ నుండి వచ్చిన కంటైనర్లో ఇది దొరకడం కలకలం రేపింది. డ్రైఈస్ట్తో మిక్స్ చేసిన బ్యాగుల్లో డ్రగ్స్ను తరలిస్తుండగా అధికారులు ఈ కంటైనర్ స్వాధీనం చేసుకున్నారు.
బ్రెజిల్ నుంచి విశాఖపట్నంలోని సంధ్యా ఎక్స్పోర్ట్స్కు కంటైనర్ వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే సంధ్యా ఎక్స్పోర్ట్స్కు సంబంధించిన యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్కు సంబంధించిన కేసులో టీడీపీకి చెందిన ఓ నేత ఉన్నారని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీ కృష్ణ దేవరాయలు & రాయపాటి జీవన్ లతో నిందితుడు కోటయ్య చౌదరి కి దగ్గర సంబంధాలున్నాయని తెలుస్తోంది.
దామచర్ల సత్య, టీడీపీ అధినేత చంద్రబాబు కి అత్యంత ఆప్తుడు.ఈకేసులో నారా లోకేష్, చంద్రబాబు కు నేరుగా సంబంధం ఉండే అవకాశం ఉంది, అందుకే ముందే ఉలిక్కిపడి తమకు సంబంధం లేదని ట్విట్టర్లో ట్వీట్లు వేశారు తండ్రి,కొడుకులు.