Saturday, April 20, 2024
- Advertisement -

విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత

- Advertisement -

విజయనగరం విషాదం చోటు చేసుకుంది. విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకురాలు ముచ్చు నాగలక్ష్మి(47) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు.

తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాగలక్ష్మికి భర్త శ్రీనివాసరావు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయనగరం ఒకటో డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన నాగలక్ష్మి మార్చి 18న డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

నాగలక్ష్మి మృతిపట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంతాపం తెలిపారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -