ఎన్నికలు ఇంకా రెండేళ్లు టైముంది. ఎన్నికల హడావుడి ఇంకా మొదలవ్వలేదు. పార్టీలన్నీ కూడా ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నాయి. పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఏపార్టీలోకి వెల్తారో తెలియని అయేమయ పరిస్తితిలు పార్టీలు తలమునకలై ఉన్నాయి.
ఇక అధికార,విపక్షాలు 2019 ఎన్నికలగురించి ఆలోచించడంలేదు….దానికి సంబందించి ప్రణాళికలను రూపొందించనేలేదు. ఇప్పుడిప్పుడే ఎన్నికలే లక్ష్యంగా పార్టీలన్ని ప్రణాళికలను రూపొందించడానికి అడుగులు వేస్తున్నాయి. ప్రశ్నించడానికే జనసేన పార్టీనీ స్తాపించిన పవణ్ కళ్యాన్ పార్టీలకంటే ఒకడుగు ముందే ఉన్నారు.పార్టీలు ఎన్నికల సమయంలో అభ్యర్తులకు సమీకరణాలను బేరీజు వేసుకొని గెలుపు గుర్రాలకు టెక్కట్లు ఇచ్చుకుంటాయి.కానీ పవణ్ మాత్రం టికెట్ల పంపకానికి తెరలేపారు. ఇప్పటినుంచే టికెట్లకోసం బేరసారాలు మొదలయ్యాయనే టాక్ బలంగా వినిపిస్తోంది.
టికెట్ల కేటాయింపుల్లో పార్టీలు అభ్యర్తి ఇమేజ్,ఆర్థిక పరిస్తితులను చూసుకొని కేటాయిస్తే పవణ్ మాత్రం పిక్స్డ్రేట్ ఏర్పాటు చేశాడంట.దానికి ఒక్కరూపాయి అయనా ఒప్పుకొనేదిలేదని కారాకండీగా చేప్పేశాడంట. ఎమ్మెల్ఏ టికెట్లుకు ఓరేటు….. ఎంపీ టికెట్ కు ఒక రేటు పిక్స్డ్ చేశారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.జనసేన బలం ఎక్కువగా ఉన్న నియేజక వర్గాల్లో మాత్రం ఈ బేరసారాలకు అడ్డూ అదుపే లేకుండా పోతోందనీ పార్టీ నాయకులు వాపోతున్నారు. పార్టీనీ స్తాపించిన తొలినాల్లో నాకు అధికాం అక్కరలేదని ప్రజాసమస్యలపై పోరాటం చేసేందుకు … ప్రజల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే వచ్చానని ఎక్కడా పో్టీచేయనని ప్రకటించిన పవణ కళ్యాన్ తర్వాత మాటమార్చారు. రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించి సంచలనాలకు తెరలేపారు. జీవితంలో ఎవరైనా సీఎం కుర్చీలో కూర్చోవాలనీ కలలు కంటారు. ముందు ఎన్నినీతులు చెప్పినా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతనీతిమంతుడికైనా అధికరా దాహం ఎవరకి ఉండదూ చెప్పండి. మరి ఇప్పుడు పవణ్ కళ్యాన్ కూడా అతీతుడేమికాదు.
మొదటి బీజేపీ,టీడీపీకీ మద్దితిచ్చిన పవణ్ కళ్యాన్ రాను రాను అయాపార్టీలకు దూరమవుతూ ప్రజాసమస్యలపై రెండు పార్టీలను విమర్శించడం మొదలు మొదలు పెట్టాడు.పూర్తిగా రెండు పార్టీలకు దూరమయ్య అన్నిపార్టీల ఆలోచనలను తలకిందులు చేస్తూ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీకీ సిద్దమంటూ సంచలనాలకు తెరలేపారు.పార్టీ ఎక్కువసేట్లు గెలవాలన్నా అధికారంలోకి రావాలన్ని గెలుపు గుర్రాలు కవాలి. ఇప్పుటినుంచే పవణ్కళ్యాన్ ఏనియేజక వర్గాల్లో బలమైన అభ్యర్తులు ఎవరు ఉన్నారు అనేదానిపై పవణ్ దృష్టి సారించి గెలుపు గుర్రాలను బరిలోకి దింపడానికి అన్ని ఏర్పాట్లు ప్రారంభినట్లు తెలుస్తోంది.పార్టీ టికెట్టు కావాలను కొనే వారు అభ్యర్తి స్తోమతను బట్టి ఎంతో కొంత ముట్టజెప్పాలనీ పవణ్ నిర్ణయించాడట..ఈనిధులను పార్టీ కోసం ఉపయేగిస్తానని కూడా స్పష్టం చేశాడంట పవణ్.
అన్ని ఆలోచనలు బాగానే ఉన్నా టికెట్ల కేటాయింపు విషయంలో పవణ్ అన్న చిరంజీవి స్తాపించిన ప్రజారాజ్యంలాగా మారుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఎందుకంటే అప్పట్లో టికెట్లను ఇష్టా రాజ్యంగా అమ్ముకున్నారనే వార్తలు ఆపార్టీని ఇబ్బందులకు గురిచేశాయి.అప్పుడు జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యంపార్టీ ఘోరంగా విఫలయ్యింది.మరి ఇప్పుడు పవణ్ స్తాపించిన జనసేన కూడా అలానే అవుతుందా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టికెట్టు కోసం ఎదురు చూసే అశవహులు మాత్రం డిస్కౌంట్లు,ఆఫర్లకోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం.
Also Read