Saturday, May 4, 2024
- Advertisement -

జ‌గ‌న్‌, స్వామీజి క‌ర‌చాల‌నంపై సోషియ‌ల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు….

- Advertisement -

జ‌గ‌న్ చేస్తున్న పాదాయ‌త్ర క‌ర్నూలు జిల్లాలో దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. అడుగ‌డుగునా ప్ర‌జ‌లు,నాయ‌కులు నీరాజ‌నాలు ప‌డుతున్నారు. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌ముఖులు క‌లుస్తున్నారు. కేసుల విచార‌ణ నిమిత్తం ప్ర‌తీ శుక్ర‌మారం సీబీఐ కోర్టుకు హాజ‌ర‌యిన జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు.

ఈ పాదయాత్ర సందర్భంగా జగన్ ను ఓ స్వామీజీ కలుసుకున్నారు. ప్ర‌స్తుతం ఇది నెట్‌లో వైర‌ల్ అవుతోంది. ఈ సందర్భంగా స్వామీజీ చేతిని ఆప్యాయంగా పట్టుకుని జగన్ అతనితో ముచ్చటించాడు. ఈ ఫొటోను వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ అవుతోంది.

(ఏందయ్యా జగన్ బాబు, నీకు ఈ కష్టాలు.. ఎలా ఉండాల్సిన వాడివి ఎలా ఉన్నావు? సొమ్ము ఒకరిది సోకు మరొకరిదిలా ఉంది నిన్ను చూస్తుంటే.దోచుకుని దాచుకుని తింటుంది ఒకరు ప్రజల కష్టాలు మాత్రం నీకా !!!
మంచి రోజులు వస్తాయి జగన్ బాబు. సాక్షాత్తు ఒక స్వామీజీ మన జగన్ అన్నతో అన్న మాటలు ఇవి…)

జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అస‌లు ఆస్వామీజి ఎవ‌రు..? ఏంచేస్తుంటారు..? ఎక్క‌డ‌నుంచి వ‌చ్చాడు…? ఎందుకు క‌లిశార‌నె ప్ర‌శ్న‌లు ఇప్పుడు త‌లెత్తున్నాయి. అస‌లు ఇద్ద‌రు ఏంమాట్లాడుకున్నారు…జ‌గ‌న్‌కు స్మామీజి ఏం చెప్పారు… అనేది పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ మ‌య్యింది.

మ‌రో వైపు ఇద్ద‌రి పై సోషియ‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్ చేస్తున్నారు. నిజం గెలుస్తుందిలే స్వామీ… జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అంటూ కొందరు స్పందించారు.

నిజమే స్వామీ, ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టులో జడ్జి దర్శనం చేసుకుని రావాలంటే కష్టంగానే ఉంది. ఏం చేస్తాం. బిడ్డ అల్లాడిపోతున్నాడు” అంటూ మరి కొందరు సెటైర్ వేస్తున్నారు. అయితె అత‌ను ఎవ‌రు అనేది తెలియాల్సిఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -