కేంద్ర ప్రభుత్వం, సోసియల్మీడియా దిగ్గజం వాట్సాప్ మధ్య వార్ జరుగుతోంది. వాట్సాప్ మీద ఆంక్షలు విధించాలనుకుంటోంది మోదీ ప్రభుత్వం. వాట్సాప్ లో ఫేక్ న్యూస్ లు ఎక్కువగా రావడం తో దేశం లో అల్లరలు పెరిగి పోతున్నాయి. దీనితో ప్రచార మాధ్యమాలను కంట్రోల్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
సందేశాలు తొలుత ఎక్కడి నుంచి వచ్చాయో కనిపెట్టగలిగే సాంకేతికత అందుబాటులో ఉండాలి. తప్పుడు వార్తలు విచ్చల విడిగా ప్రచారం కాకుండా అడ్డుకట్ట వేయాలని, అసలు వాటిని ఎవరు క్రియేట్ చేసి పంపిస్తున్నారో కూడా తెలుసుకునే విధానాన్ని అందుబాటులోకి తేవాలని ఆయన వాట్సాప్ నిర్వాహకులకు సూచించారు.ఈ విషయంపైనే 2 రోజుల క్రితం కేంద్ర ఐటీమంత్రి రవిశంకర్ ప్రసాద్.. వాట్సాప్ సీఈఓ క్రిస్ డేనియేల్స్ తో భేటీ అయ్యారు.
ఇలాంటి సాంకేతికతను అభివృద్ధి చేస్తే యూజర్ల వ్యక్తిగత గోప్యతతో పాటు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉద్దేశాలు దెబ్బతింటాయని ప్రముఖ సోషల్మీడియా సంస్థ వాట్సాప్ భారత ప్రభుత్వానికి స్పష్టంచేసింది. నకిలీ సందేశాలను అడ్డుకునేందుకు వార్తల మూలాలను కనిపెట్టే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. యూజర్ల గోప్యత నిబంధనల్ని ఉల్లంఘించే పనులను వాట్సాప్ ఎన్నడూ చేయబోదు’ అని ఆయన అన్నారు.
ఒకరకంగా వాట్సాప్ కి ఇది వార్నింగ్ అనుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా తమసేవలు అందుబాటులో ఉన్న ఏ దేశంలోనూ రాని సమస్య ఇండియాలో మాత్రమే వచ్చేసరికి వాట్సాప్ కూడా పునరాలోచనలో పడింది. కేవలం ఇండియా కోసమే వాట్సాప్ పై ఆంక్షలు విధించడం, మెసేజ్ లను ఎవరు తయారు చేశారో తెలుసుకునేలా ప్రోగ్రామ్స్ రూపొందించడం సరికాదని ఆ కంపెనీ నిర్వాహకులు అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది. కేంద్రం మరీ ఒత్తిడి పెంచితే మనదేశంలో వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగే అవకాశాలున్నాయి.