తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు వందల్లో ఉన్న కేసులు వేలు దాటుతున్నాయి. ఒక్క రోజే దాదాపు 6 వేల వరకు కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనను పెంచుతోంది. నిన్న 1,22,143 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… 5,926 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 793 కేసులు నమోదయ్యాయి.
ఇటీవల సాగర్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు, భారీ సభలు నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సభ్యులకు కరోనా పట్టి పీడిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కి కరోనా పాజిటీవ్ నిర్దారణ అయ్యింది. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ కి కూడా కరోనా సోకింది. అయితే సీఎం కేసీఆర్ కి కరోనా పాజిటీవ్ నిర్దారణ అయ్యిందని తెలియగానే పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఆయన త్వరగా కోలుకోవాలని ట్విట్స్ చేస్తున్నారు.
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన కోలుకుని ఎప్పటిలాగే ప్రజా సేవలో నిమగ్నం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. తాజాగా పవన్ కళ్యాన్ కి కరోనా నెగిటీవ్ అని తేలింది. ఈ విషయం తెలిశాక… జనసేన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.