తన భవిష్యత్తుపై ఎన్నో అంచనాలతో అత్తారింటికి వచ్చిన ఓ నవ వధువుకు తొలిరాత్రే చుక్కలు చూపించాడు శాడిష్ట్ భర్త. తాను సంసారానికి పనికిరాడనే విషయం తొలిరాత్రే నవవధువుకు తెలిసింది.దీంతో నవ వధువు నగ్న చిత్రాలను తీశాడు. తన లోపాన్ని బయటకు చెబితే, వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ భార్య ఆరోపించింది. చిత్ర హింసలు పెడుతుంటే చేసేది లేక చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది.
అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన ఐటీ ఉద్యోగి రాజేంద్రప్రసాద్ కు గత సంవత్సరం ఆగస్టులో వివాహమైంది. ఆ సమయంలో వధువు తల్లిదండ్రులు రూ. 45 లక్షల కట్నాన్ని సమర్పించుకున్నారు. రాజేంద్రప్రసాద్ సంసారానికి పనికిరాడన్న విషయాన్ని దాచి పట్టిన ఆయన తల్లిదండ్రులు, ఈ పెళ్లి చేసి తమ చేతులు దులుపుకున్నారు. ఆపై విషయం తెలుసుకున్న యువతి, బయటకు చెప్పుకోలేక లోలోపలే మధనపడింది.ఈ విషయాన్ని తన అత్త, మామలకు కూడ చెబితే తననే బెదిరించారని చెప్పారు.
అయితే తనకే టీబీ ఉందని తప్పుడు ప్రచారం చేశారని రాజేంద్రప్రసాద్ కుటుంబసభ్యులపై యువతి ఆరోపించారు. తనకు టీబీ లేదని రాజేంద్రప్రసాద్ కుటుంబసభ్యులు చూపిన ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొంటే ఎలాంటి జబ్బు లేదని తేలిందని ఆ యువతి చెప్పారు.
మరో వైపు మరో పెళ్లి చేసుకొనేందుకు వీలుగా తనకు విడాకులు కావాలని రాజేంద్రప్రసాద్ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. తన మాదిరిగా మరో యువతి జీవితం నాశనం కాకూడదనే ఉద్దేశ్యంతోనే తాను మీడియాను ఆశ్రయించినట్టు బాధితురాలు చెప్పారు.