ఢిల్లీలో ఒక యువకుడిని హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న రెజ్లర్ సుశీల్ కుమార్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ అతని ఆచూకీ పోలీసులకు లభ్యం కాలేదు. పోలీసులు అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసారు. లుకౌట్ నోటీసులు కూడా జరీ చేశారు. అంతే కాదు అతడి తలపై పోలీసులు లక్ష రూపాయల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సుశీల్ కుమార్ ఢిల్లీలోని రోహిణి కోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో సాగర్ ధంకడ్ అనే జూనియర్ రెజ్లర్ హత్య జరిగింది. ఈ హత్యలో సుశీల్ కుమార్ కూడా పాల్గొన్నాడని పోలీసులు గుర్తించారు.
ఈ హత్య కేసులో సుశీల్ కుమార్ హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే అతడు పరారీలో ఉండటంతో అతడి పాత్రపై అనుమానాలు బలపడ్డాయి. అతని పిటీషన్పై ఈరోజు విచారణ జరగనుంది. సుశీల్ కుమార్ మర్డర్ కేసులో ఇరుక్కోవడంతో భారత రెజ్లింగ్ సమాఖ్య ఇప్పటికే సీరియస్గా స్పందించింది.
కరోనా కాటుకు ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత