సరిహద్దుల్లో ఎలాంటి విపత్కర పరిస్తితులను ఎదుర్కోవడానికైనా సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని భారత సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్ స్పష్టం చేశారు.జమ్మూకశ్మీర్లో కల్లోల పరిస్థితులకు పాక్ కారణమని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ద్వారా కశ్మీర్ యువతను పాక్ రెచ్చగొడుతుందని ఆర్మీ చీఫ్ వెల్లడించారు.
భారత్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆర్మీ ఆధునికీకరణ అంశాన్ని ప్రభుత్వంతో ప్రస్తావిస్తున్నామని, ఈ విషయంలో పురోగతి బాగుందని ఆయన వెల్లడించారు. పాక్, చైనా, కశ్మీర్ కల్లోల పరిస్థితులను ఉటంకిస్తూ రెండున్నర యుద్దాలను ఎదుర్కోవడానికి భారత్ సన్నద్ధంగా ఉందని రావత్ వ్యాఖ్యానించారు.
{loadmodule mod_custom,Side Ad 1}
ఆర్మీ ఆధునికీకరణకు సంబంధించిన పురోగతి బాగుందని తెలిపారు. కశ్మీర్లోని నౌగామ్ సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని గురువారం భారత ఆర్మీ తిప్పికొట్టింది. చొరబాటుదారులతో జరిగిన ఎన్కౌంటర్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు.సరిహద్దుల గుండా భారత్ లోకి చొరబడుతున్న ముష్కరులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.
{loadmodule mod_custom,Side Ad 2}
Also read