Saturday, April 20, 2024
- Advertisement -

దొంగ ఓట్లు – దొంగ నోట్ల రాజ్యం.. హాట్ కామెంట్స్ తో రీ ఎంట్రీ..!

- Advertisement -

రాష్ట్రాన్ని దొంగ ఓట్లు – దొంగ నోట్ల రాజ్యంగా చేశారని టిడిపి నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. దొంగల పాలనలో రాష్ట్రం మొత్తం దొంగల మయమైందని అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక దొంగ నోట్ల అంశంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్ల ముద్రణ మంత్రుల ప్రమేయంతో జరిగింది కాదా? అని ప్రశ్నించారు. పోలింగ్ రోజు దొంగ ఓటర్లతో బస్సులు తిరుపతికి ఎలా వచ్చాయని నిలదీశారు. వాళ్లంతా మంత్రులు పంపిన వైసిపి వాళ్లు కాదా? అని నిలదీశారు.

ఓటమి భయంతోనే దొంగ ఓట్లు-దొంగ నోట్లతో జగన్ జిత్తులు చేశారని యనమల దుయ్యబట్టారు. తెదేపా ఫిర్యాదులపై సీఈసీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు – దొంగ నోట్ల వెనుక ఉన్న మంత్రులపై తక్షణమే కేసులు పెట్టాలన్నారు. ఓట్లు ముద్రించిన వాళ్లపై ఐపీసీ కింద కఠిన చర్యలు చేపట్టాలన్న ఆయన.. తిరుపతి అసెంబ్లీ పరిధిలో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని కోరారు.

కమలా హారిస్‌ను చంపేస్తామని బెదిరించిన నర్సు అరెస్ట్!

మహారాష్ట్ర, ఢిల్లీ లో కరోనా డేంజర్ బెల్!

అల్లుడికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -