- Advertisement -
హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో దారుణం చోటు చేసుుంది. స్వేహితుల మధ్య తగాదాలు తలెత్తడంతో ప్రేమ్ అనే యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా హతమార్చారు. వివరాల్లోకి వెల్తే…ప్రేమ్, సతీశ్ ఇద్దరు స్నేహితులు ఫిలింనగర్లో నివాసం ఉంటున్నారు. సతీశ్ అనే వ్యక్తి తన స్నేహితుడు ప్రేమ్ను గంజాయి తాగేందుకు పిలిచాడు. మరికొందరితో కలిసి గంజాయి తాగిన అనంతరం ప్రేమ్, సతీశ్ల మధ్య ఓ విషయమై తీవ్ర వాగ్వాదం చోటు చేసు కుంది. దీంతో దీంతో సతీశ్ అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు.
సతీశ్తో పాటు మరి కొంత మంది యువకులు ప్రేమ్పై దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ ప్రేమ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఇద్దరి మధ్య కొన్నాల్లుగా విబేధాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.