Saturday, May 4, 2024
- Advertisement -

కేసీఆర్ రూ.1000 కోట్ల గిఫ్ట్‌పై బాబు, ప‌వ‌న్ ను దుమ్ముదులిపిని జ‌గ‌న్‌

- Advertisement -

ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేమ‌ని తెలిసిపోయిన చంద్ర‌బాబు ఇప్పుడు తెలంగాణా సీఎం కీసీఆర్ ను బూచిగా చూపిస్తూ గెల‌వాల‌ని కుయుక్తులు ప‌డుతున్నారు. ఆంధ్రావాల్ల మీద దాడి చేస్తున్నార‌ని ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు చేయ‌డంద్వారా ప్రాంతీయ విధ్వేషాల‌ను రెచ్చ‌గొట్టేంద‌కు తీవ్రంగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జ‌గ‌న్‌కు ఎన్నిక‌ల ఖ‌ర్చుకోసం కేసీఆర్ రూ.1000 కోట్లు ఇచ్చార‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాబు, ప‌వ‌న్‌లు ఆరోపిస్తున్నారు. ప‌వ‌న్ , బాబు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను జ‌గ‌న్ దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చారు.

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ ప‌వ‌న్‌, బాబుల‌ను ఉతికి ఆరేశారు. కేసీఆర్ నాకు రూ. 1000 కోట్లు ఇస్తుంటె నువ్వు చూశావా…..! లేక పోతె కేసీఆర్ నీకు పోన్ చేసి చెప్పారాని నిల‌దీశారు .ప్ర‌త్యేక‌హ‌క్ష‌దాకు ప‌క్క రాష్ట్ర సీఎం కేసీఆర్ మ‌ద్ద‌తు ఇస్తుంటె బాబు నాయుడికి అభ్యంతరం ఏంటని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు .చంద్రబాబు పార్టనర్, యాక్టర్ పవన్ కల్యాణ్ కూడా ఇదే భాషను మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఈ యాక్టర్ గత ఐదేళ్లలో కేసీఆర్ ను ఎన్నిసార్లు పొగిడారో గుర్తుచేసుకోవాలని సూచించారు. సిగ్గులేకుండా, వయసుకు గౌరవం లేకుండా నిసిగ్గుగా అబద్ధాలు ఆడటం చంద్రబాబుకే చెల్లుబాటు అవుతుందని విమర్శించారు. నీతో పొత్తు పెట్టుకుంటే వాళ్లు మంచివాళ్లు, మీరూ మంచివాళ్లు. పొత్తు పెట్టుకోకుంటే వాళ్లంతా అన్యాయస్తులు, దుర్మార్గులు అని ఎలా అంటావ్ చంద్రబాబూ?’ అని నిలదీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -