Friday, May 3, 2024
- Advertisement -

ట్విట్టర్ లో చంద్ర‌బాబును కడిగిపారేసిన జ‌గ‌న్‌…

- Advertisement -

మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించాలన్న ఆలోచనను వ్యతిరేకిస్తూ మధ్యాహ్న భోజన కార్మికుల‌పై ప్ర‌భుత్వం విధానాన్ని ఖండించారు జ‌గ‌న్‌. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకోవ‌డానికి వ‌స్తే వారిపై పోలీసులు అమానుషంగా ప్ర‌వ‌ర్తించ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు. చంద్రబాబు గారూ… ఆడపడుచులపై ఏమిటీ అమానుషం? వారేం తప్పు చేశారు? అధికారం ఉంది కదా అని కర్కశంగా వ్యవహరిస్తారా?” అంటూ వైఎస్ జగన్, సీఎం చంద్రబాబుపై ట్విట్ట‌ర్‌లో నిప్పులు చెరిగారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించాలన్న ఆలోచనను వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనలను అణచివేసేందుకు పోలీసులు కటువుగా వ్యవహరించిన నేపథ్యంలో జగన్, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. మహిళలు అంటే ఎంతో మర్యాద అన్నట్లు పోజులు కొడతారని, విజయవాడలోనే మహిళా పార్లమెంట్ అంటూ పెట్టి ఆర్భాటాలకు పోతారని జగన్ అన్నారు. మరి అదే మహిళలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే మాత్రం పోలీసులను పెట్టి కొట్టిస్తారంటూ ఫైర్ అయ్యారు. వారేం తప్పు చేశారని అంత దురుసుగా వ్యవహరించారని జగన్ ప్రశ్నించారు. తమ సమస్యలు చెప్పుకోవడమే నేరమా అని నిగ్గదీశారు. ఈ ప్రభుత్వం సరిగ్గా వేతనాలు ఇవ్వకున్నా, 5 – 6 నెలలుగా సరుకుల బిల్లులు చెల్లించకపోయినా, 85 వేల మంది అప్పో, సొప్పో చేసి పిల్లలకు భోజనం వండి పెడుతున్నారు.

అయినా సరే, దేశంలో ఎక్కడాలేని విధంగా భోజనం వండే పని నుంచి వారిని తొలగించి, ప్రైవేటు ఏజన్సీలకు అప్పగించడానికి ఈ సర్కారు తహతహలాడుతోంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మధ్యాహ్న భోజనం వండే పనిని అక్క చెల్లెమ్మలకే అప్పగిస్తాం. వారికి గౌరవవేతనం పెంచి అండగా ఉండటంతో పాటు పిల్లలకు పౌష్టికాహారం అందేలా భోజన ధరలు పెంచి, బిల్లులు సకాలంలో చెల్లిస్తాం” అని జగన్ వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -