Friday, May 3, 2024
- Advertisement -

పార్టీఎమ్మెల్యేల‌, ఎమ్మెల్సీల ఆగ‌స్ట్‌నెల వేత‌నాన్ని కేర‌ళకు విరాలంగా ఇవ్వాల‌ని అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి జ‌గ‌న్ లేఖ‌

- Advertisement -

భారీ వరదలతో అస్తవ్యస్తమైన కేరళకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు ఆపన్నహస్తం అందించారు. పార్టీ త‌రుపున కోటి విరాలం ప్ర‌క‌టించారు జ‌గ‌న్‌. ఇక పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల వేత‌నాన్ని కేర‌ల వ‌ర‌ద‌బాధితుల‌కు ఇస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దీనిలో భాగంగానే వైఎస్ జ‌గ‌న్ అసెంబ్లీకార్య‌ద‌ర్శికి లేఖ రాశారు.

తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆగస్టు నెల జీతంతో పాటు అలవెన్సులను కేరళ వరద బాధితులకు అందజేయాలని కోరారు. ఈ మొత్తాన్ని వైఎస్సార్‌సీపీ తరపున కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు జమ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -