Thursday, May 2, 2024
- Advertisement -

మహారాష్ట్ర లో మరోగోల..లేఖ వేరే మెయిల్ ఐడీ నుంచిరాలేదు..!

- Advertisement -

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్​పై సంచలన ఆరోపణలు చేస్తూ సీఎం ఉద్ధవ్​ ఠాక్రేకు పంపిన లేఖపై ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్​బీర్ సింగ్ స్పష్టతనిచ్చారు. తన ఈ-మెయిల్ ఐడీ నుంచే లేఖను పంపినట్లు చెప్పారు.

లేఖ ఎవరు పంపారు అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం కార్యాలయం ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో ఈ మేరకు స్పష్టతనిచ్చారు పరమ్​బీర్ సింగ్.అంతకుముందు, ఉదయం 4.37 గంటలకు మెయిల్ వచ్చిందని సీఎం కార్యాలయం తెలిపింది. పరమ్​బీర్ సింగ్ అధికారిక ఖాతా నుంచి లేఖ రాలేదని పేర్కొంది. ఆయన సంతకం కూడా లేదని వెల్లడించింది. లేఖను పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇందుకోసం ఆయనను సంప్రదిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పరమ్​బీర్ సింగ్ ప్రకటన చేయడం గమనార్హం.

హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు పరమ్​బీర్​ సింగ్​. నెలకు​ రూ.100 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు.. పోలీసు అధికారి సచిన్​ వాజేతో హోంమంత్రి చెప్పారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను మంత్రి ఖండించారు.

జగనన్న కోసం సైనికుడిలా పనిచేస్తా!

స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మిస్సింగ్.. సూసైడ్ నోట్.. నేతల టెన్షన్!

అపరదానకర్ణుడు సోనూసూద్ కి అరుదైన గౌరవం!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… ప్ర‌యివేటుకు ఇసుక తవ్వకాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -