మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై సంచలన ఆరోపణలు చేస్తూ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు పంపిన లేఖపై ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ స్పష్టతనిచ్చారు. తన ఈ-మెయిల్ ఐడీ నుంచే లేఖను పంపినట్లు చెప్పారు.
లేఖ ఎవరు పంపారు అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం కార్యాలయం ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో ఈ మేరకు స్పష్టతనిచ్చారు పరమ్బీర్ సింగ్.అంతకుముందు, ఉదయం 4.37 గంటలకు మెయిల్ వచ్చిందని సీఎం కార్యాలయం తెలిపింది. పరమ్బీర్ సింగ్ అధికారిక ఖాతా నుంచి లేఖ రాలేదని పేర్కొంది. ఆయన సంతకం కూడా లేదని వెల్లడించింది. లేఖను పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇందుకోసం ఆయనను సంప్రదిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పరమ్బీర్ సింగ్ ప్రకటన చేయడం గమనార్హం.
హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు పరమ్బీర్ సింగ్. నెలకు రూ.100 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు.. పోలీసు అధికారి సచిన్ వాజేతో హోంమంత్రి చెప్పారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను మంత్రి ఖండించారు.
జగనన్న కోసం సైనికుడిలా పనిచేస్తా!
స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మిస్సింగ్.. సూసైడ్ నోట్.. నేతల టెన్షన్!